calender_icon.png 31 May, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాళ్ల పురం అటవీ ప్రాంతంలో రహదారి మార్గం

29-05-2025 12:35:16 PM

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో సొంత ఖర్చుతో సి ఐ రాజు వర్మ అభివృద్ధి పనులు 

చర్ల , (విజయక్రాంతి):  ప్రాణాలు తెగించి శాంతిభద్రతలు కాపాడే దిశగా అడుగులు వేసేది ఎవరైనా ఉన్నారంటే అది పోలీస్ వ్యవస్థ మాత్రమే. అటువంటి పోలీసు వ్యవస్థ  తమ వృత్తి ధర్మంతో పాటు సామాజిక సేవలు కూడా పాల్గొంటూ మండల ప్రజల  మన్ననలుపొందుతున్నారు , ఆదివాసీల సంక్షేమ కోసం అండగా పోలీసులు నిత్యం ఉంటారు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో గల దట్టమైన అటవీ ప్రాంతాలలో ఉన్నటువంటి  ఆదివాసి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తు సిఐ రాజు వర్మ తీసుకున్న నిర్ణయం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, రాళ్ల పురం  అది పూర్తిగా అటవీ ప్రాంతం అక్కడ సరైన రోడ్డు వ్యవస్థ  లేక ఆదివాసి గిరిజనులు అవస్థలు పడుతున్నారు.

గత కొంత కాలం గా రాళ్లపురం ప్రజల మనోవేదనను గుర్తించిన సీఐ రోడ్డు మరమ్మత్తులకు పూనుకున్నారు, వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఆదివాసీలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తల సొంత ఖర్చులతో గ్రామాలలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. ఇప్పటికే అనేక గ్రామాలలో పాఠశాలలను సొంత ఖర్చులతో నిర్మించారు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో అనేక వైద్య సేవా కార్యక్రమాలు ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ సహకారాలతో సేవా కార్యక్రమాలకు నాంది పలుకుతూ ఆదివాసీల అభివృద్ధికి చేదోడువాదొడుగా ఉంటున్నారు, ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పనిచేయటం అంత సులువైన పని కాదు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎక్కడ ఎటువంటి బాంబులు అమర్చారు తెలియని పరిస్థితులలో అటవీ ప్రాంతాలకు వెళ్లి గిరిజన ఆదివాసీలకు అండగా నిలవడం నిజంగా పోలీసులు చేస్తున్న సాహసమే అనుకోవాలి , శాంతి భద్రతల విషయం లో గానీ  సేవా కార్యక్రమా విషయం లో గాని  రెండు కళ్ళుగా భావిస్తున్న సిఐ  చేసిన పని పట్ల  ఆదివాసీలు, మండలప్రజలు అభినందిస్తున్నారు.