29-05-2025 12:33:08 PM
సదాశివపేట,(విజయక్రాంతి): గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన సదాశివపేట మండలం(సదాశివపేట మండలం) గొల్లగూడెం గ్రామశివారులోని జాతీయ రహదారి పక్కన చోటుచేసుకుంది. గురువారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.