18-06-2025 12:35:36 AM
- 9న అనారోగ్యం కారణం చూపి ఈడీ విచారణకు గైర్హాజరు
- తాజాగా కుమార్తె స్నాతకోత్సవం ఉందని డుమ్మా
న్యూఢిల్లీ, జూన్ 17: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసీసీ అగ్ర నాయకురాలు, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు డుమ్మా కొట్టారు. బ్రిటన్కు చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈనెల 9న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేయగా, తాను ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నానని, కొవిడ్ పరీక్షలు సైతం చేయిం చుకోవాల్సి ఉందనే కారణం చూపు తూ.. విచారణకు గైర్హాజరయ్యారు.
దీంతో ఈడీ ఆయనకు మంగళవారం(17వ తేదీ)వ విచారణకు హాజరు కావాలని తిరిగి సమన్లు ఇచ్చింది. విదేశంలో తన కుమార్తె స్నాతకోత్సవం ఉందని, తాను తప్పకుండా ఆ కార్య క్రమానికి హాజరు కావాల్సి ఉందని, అందు కే తాను విచారణకు హాజరు కాలేపోతున్నానని, తిరిగి వచ్చాక విచారణకు హాజరవు తానని ఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈడీ ఇప్పుడు వాద్రా సమాధా నంపై ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.