18-06-2025 12:37:41 AM
- కోల్కతా ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్
- మరో రెండు విమానాల్లోనూ సమస్యలు
- వరుస సంఘటనల నేపథ్యంలో డీజీసీఏ కీలక సమావేశం
న్యూఢిల్లీ, జూన్ 17: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అహ్మదా బాద్లో విమాన ప్రమాద ఘటన మరువక ముందే సోమవారం అర్ధరాత్రి శాన్ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లుటై ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్లు కోల్కతా విమనాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాం డింగ్ చేసి, ప్రయాణికులను సురక్షితంగా దించేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్కు ముందే విమానాన్ని నిలిపివేశారు. అహ్మదాబాద్ విమానశ్రయం నుంచి మంగళవారం మధ్యాహ్నం లండన్ వెళ్లాల్సిన ఎయిర్ఇండియా ఏఐ బోయింగ్ విమానం 787 డ్రీమ్లైనర్ ఫ్లుటైలో నిపుణులు ముందుగానే సాంకేతిక సమస్యను గుర్తించా రు. దీంతో అథారిటీ ఫ్లుటై టేకాఫ్ను నిలిపివేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమా దం తర్వాత లండన్కు వెళ్లాల్సిన తొలి ఫ్లుటై ఇదే కావడం గమనార్హం.
మరోవైపు ఫ్లుటై రద్దుపై ఎయిర్ ఇండియా యాజమాన్యం స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా ఫ్లుటై రద్దు కాలేదని, సాంకేతిక బృందం తనిఖీలు చేసే సమయంలో ఫ్లుటై అందుబా టులో లేదని చెప్పుకొచ్చింది. ఏదేమైనా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామ ని ప్రకటన విడుదల చేసింది. ప్ర యాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని, వారు రీఫండ్ కోరుకుంటే.. ఆ వెసులుబాటు కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. ఎయి ర్ ఇండియా యాజమాన్యంతో కీలక సమావేశం నిర్వహించింది. అనేక అంశాలపై సూచనలు సలహాలిచ్చింది.