09-08-2025 02:12:55 AM
రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి
కామారెడ్డి, ఆగస్టు8 (విజయ క్రాంతి), పేద, మధ్యతరగతి, యువతీ యువకులకు స్వయం ఉపాధి ఆవకాశాలు కల్పించడంలో రోటరీ క్లబ్ ముందుంటుందని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ, రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 3.80 లక్షల ఎంబ్రాయిడరీ మిషన్ మహిళ కు అందజేశారు. రైతులకు 50 వేల విలువగల తాటిపత్రులను సబ్సిడీతో అందజేశారు.
మహిళలకు కుట్టు మిషన్లు విద్యార్థులకు టాప్స్ ఉచిత వైద్య పరీక్షలతో పాటు రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల ను చేయడానికి రోటరీ క్లబ్ ముందు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ యూసఫ్, రోటరీ క్లబ్ కామారెడ్డి అధ్యక్షులు శంకర్, సెక్రెటరీ సబ్బని కృష్ణ హరి, ప్రోగ్రాం చైర్మన్ రాజనర్సింహారెడ్డి, కోశాధికారి రమణ కుమార్, అరవింద్, శ్రీశైలం, సుధాకర్, నవీన్ కుమార్, రైతులు భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విశిష్ట అతిథి డిడబ్లుఓ ప్రమీల మాట్లాడుతూ మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని తెలియజేశారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళల కుట్టు మిషన్స్,విద్యార్థులకు ట్యాబ్స్, ఉచిత వైద్య పరీక్షలు వీటితో పాటు రైతులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలను చేయడానికి రోటరీ క్లబ్ ముందుంటుందని తెలిపా రు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షులు శంకర్ సెక్రెటరీ సబ్బని కృష్ణ హరి, ప్రోగ్రామ్ చైర్మన్ రాజనర్సింహారెడ్డి ,ట్రెజరర్ రమణ కుమార్ పిఫ్ఐ మెంబర్ అరవింద్ ఎంఈఓ యోసేఫ్, రోటరీ మెంబర్స్ శ్రీశైలం, సుధాకర్, నవీన్ కుమార్ రైతులు భూమ్ రెడ్డి పాల్గొన్నారు.