అంబేద్కర్ సంఘం అడహక్ కమిటీ ఏర్పాటు
17-05-2026 06:19 PM
సంఘాన్ని బలోపేతం చేస్తాం
మండల కన్వీనర్ మేస సతీష్
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం అంబేద్కర్ సంఘం అడహక్ కమిటీ ఏర్పాటు అయింది. ఆదివారం ఖానాపూర్లో సమావేశం నిర్వహించి ఈ కమిటీ ఏర్పాటు చేశారు. సంఘం మండల కన్వీనర్ గా మేసా సతీష్, కో కన్వీనర్ బొమ్మన రాజ్ కుమార్, నిట్ట రవి ,పట్టణ కమిటీ చుక్కల నరేష్, నేరెళ్ల విక్రాంత్, గుడిమందుల శ్రీహరిలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మేస సతీష్ మాట్లాడుతూ త్వరలోనే మండలంలోని అన్ని గ్రామాల్లో పూర్తి కమిటీలు ఏర్పాటు చేసి సంఘాన్ని బలోపేతం చేస్తామని అన్నారు.






