calender_icon.png 13 June, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయతీని చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

27-05-2025 12:00:00 AM

- ప్రయాణికుడు పోగొట్టుకున్న రూ. 3.50 లక్షల విలువైన బ్యాగు తిరిగి అందజేత

శేరిలింగంపల్లి, మే 26:ఓ బస్సు డ్రైవర్ తన నిజాయితీ చాటుకని ప్రయాణంలో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న సుమారు రూ. 3.50 లక్షల విలువైన వస్తువులను భద్రంగా అప్పగించాడు. ఈ సంఘటన మియాపూర్ బస్ డిపో 2 లో జరిగింది.

ఆదివారం సాయంత్రం పుష్పక్ బస్ నంబర్ TS10UB8190 లో జేయన్ టీయూలో నివాసం ఉండే అల్లూరి చిట్టిబాబు  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మియాపూర్ వైపుకు వస్తున్నాడు. ఈ క్రమంలో బంగారం,  ల్యాప్టాప్, వాలెట్ తోపాటు.

ముఖ్యమైన విద్యా ధృవపత్రాలు ఉన్న బ్యాగ్ వదిలిపెట్టి బస్ దిగి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన  డ్రైవర్ ఈ. రమేశ్  గుర్తించి సురక్షితంగా డిపోలో భద్రపరిచారు. సోమవారం సదరు బ్యాగు  చిట్టిబాబుదిగా గుర్తించి ఆ బ్యాగును  మియాపూర్-2 డిపో మేనేజర్ వి. వెంకటేశం,డిపో విజిలెన్స్ , ఎలక్ట్రిక్ బస్సుల బృందం సభ్యుల సమక్షంలో అందజేశారు. డ్రైవర్  రమేశ్  నిజాయితీ,సేవాభావాన్ని గుర్తించి, డిపో మేనేజర్ వి. వెంకటేశం ఆయనను ఘనంగాసన్మానించారు.