27-05-2025 12:00:00 AM
- ప్రయాణికుడు పోగొట్టుకున్న రూ. 3.50 లక్షల విలువైన బ్యాగు తిరిగి అందజేత
శేరిలింగంపల్లి, మే 26:ఓ బస్సు డ్రైవర్ తన నిజాయితీ చాటుకని ప్రయాణంలో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న సుమారు రూ. 3.50 లక్షల విలువైన వస్తువులను భద్రంగా అప్పగించాడు. ఈ సంఘటన మియాపూర్ బస్ డిపో 2 లో జరిగింది.
ఆదివారం సాయంత్రం పుష్పక్ బస్ నంబర్ TS10UB8190 లో జేయన్ టీయూలో నివాసం ఉండే అల్లూరి చిట్టిబాబు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మియాపూర్ వైపుకు వస్తున్నాడు. ఈ క్రమంలో బంగారం, ల్యాప్టాప్, వాలెట్ తోపాటు.
ముఖ్యమైన విద్యా ధృవపత్రాలు ఉన్న బ్యాగ్ వదిలిపెట్టి బస్ దిగి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ ఈ. రమేశ్ గుర్తించి సురక్షితంగా డిపోలో భద్రపరిచారు. సోమవారం సదరు బ్యాగు చిట్టిబాబుదిగా గుర్తించి ఆ బ్యాగును మియాపూర్-2 డిపో మేనేజర్ వి. వెంకటేశం,డిపో విజిలెన్స్ , ఎలక్ట్రిక్ బస్సుల బృందం సభ్యుల సమక్షంలో అందజేశారు. డ్రైవర్ రమేశ్ నిజాయితీ,సేవాభావాన్ని గుర్తించి, డిపో మేనేజర్ వి. వెంకటేశం ఆయనను ఘనంగాసన్మానించారు.