21 August, 2026 | 12:26 PM

Breaking News

రాజీవ్ గాంధీ దేశానికే ఆదర్శం   •   పాలిటెక్నిక్‌ల విలీనాన్ని విరమించుకోవాలి   •   భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం... మహిళలు ప్రత్యేక పూజలు   •   ఆటోనగర్ ఏర్పాటుకు నూతన కార్యవర్గం ఎన్నిక   •   వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు   •   ఒకే విగ్రహం.. రెండు నివాళులు..! కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ   •   కేసముద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో   •   హెచ్.సి.యూలో సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన సర్పంచ్   •   ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో లబ్ధిదారుల్ని తికమక పెట్టదు   •   అమెరికా పర్యటన కొనసాగించండి... అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం   •  

దాబాలలో నిబంధనలు పాటించాలి

04-07-2025 12:41 AM

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :  డీఎస్పీ నరేందర్‌గౌడ్ 

తూప్రాన్, జులై 3 : తూప్రాన్ పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారిపై ఉన్న దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు చోరులకు అడ్డాలుగా మారుతున్నాయని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ తెలిపారు. గురువారం స్థానిక లింగారెడ్డి గార్డెన్స్లో డీఎస్పీ  ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చట్టానికి అనుకూలంగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని, నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

రాత్రుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు కల్తీలేని మంచి భోజనం అందించాలని, దాబాలలో మందు విక్రయాలు చేయరాదని హెచ్చ రించారు. దాబాల నిర్వహణ రాత్రి 11 వరకు నిర్వహించాలని, దాబాల వద్ద గాంజా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు.

దాబా యజమానులు  జాగ్రత్తగా వ్యవహరించాలని, నిభందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సిఐ, నర్సాపూర్ సిఐ, రామయంపేట్ సిఐ, తూప్రాన్ ఎస్‌ఐ, డివిజన్ పరిధి ఎస్‌ఐలుఉన్నారు.