4 May, 2026 | 4:13 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

దాబాలలో నిబంధనలు పాటించాలి

04-07-2025 12:41 AM

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :  డీఎస్పీ నరేందర్‌గౌడ్ 

తూప్రాన్, జులై 3 : తూప్రాన్ పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారిపై ఉన్న దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు చోరులకు అడ్డాలుగా మారుతున్నాయని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ తెలిపారు. గురువారం స్థానిక లింగారెడ్డి గార్డెన్స్లో డీఎస్పీ  ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చట్టానికి అనుకూలంగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని, నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

రాత్రుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు కల్తీలేని మంచి భోజనం అందించాలని, దాబాలలో మందు విక్రయాలు చేయరాదని హెచ్చ రించారు. దాబాల నిర్వహణ రాత్రి 11 వరకు నిర్వహించాలని, దాబాల వద్ద గాంజా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు.

దాబా యజమానులు  జాగ్రత్తగా వ్యవహరించాలని, నిభందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సిఐ, నర్సాపూర్ సిఐ, రామయంపేట్ సిఐ, తూప్రాన్ ఎస్‌ఐ, డివిజన్ పరిధి ఎస్‌ఐలుఉన్నారు.