10 May, 2026 | 11:52 AM

Breaking News

తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •   ఖమ్మంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కలకలం   •  

రైతుభరోసా విడుదల.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు

27-01-2025 05:05 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రజా ప్రభుత్వం అందిస్తున్న  రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కొనసాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తొలివిడతలో మండలానికొక గ్రామంలో రైతుభరోసా సొమ్ము విడుదల చేసి, ఇవాళ 4,41,911 రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 577 మండలల్లో 9,48,333 ఎకరాలకు రూ.563 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇక నుంచి ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు నుంచి రూ.12 వేలకు పెంచిన ఆర్థిక సహయం రైతుల ఖాతాల్లో జమ అవుతూందని మంత్రి తుమ్మల తెలిపారు.  దీంతో రైతుభరోసా సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.