15 March, 2026 | 8:36 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

రైతులకు అవగాహన కల్పించడానికి రైతునేస్తం

04-12-2024 02:40 AM

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యవసాయ, అనుబంధ శాఖ కార్యకలపాలపై రైతులకు అవగాహన కల్పించడానికి  ప్రతి మంగళవారం రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకులు డా. గోపి తెలిపారు. యాసంగిలో స్వల్పకాలిక వరి రకాల సాగు, నారుమడి యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించామన్నారు.

ఈ సీజన్‌లో రైతులు  స్వల్పికాలిక రకాలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. వరి నాడు మడులలో తరుచుగా కనిపించే జింక్ ధాతువు లోపానికి తీసుకోవాల్సిన చర్యలను డా. చంద్రమోహన్ వివరించారు.కార్యక్రమంలో 566 రైతు వేదికల నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు  సిబ్బంది, ఎలక్ట్రానిక్ విభాగం, రాజేంద్రనగర్ వ్యవసాయ విద్యాలయం అధికారులు, రైతులు పాల్గొన్నారు.