11 April, 2026 | 12:29 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

తల్లిదండ్రులను కోల్పోయిన సాద్దీన్ కుమార్

15-10-2025 06:42 PM

చొప్పదండి (విజయక్రాంతి): ఐదవ తరగతి చదువుతున్న సాద్దీన్ విద్యార్థి తల్లి తండ్రి మరణించడంతో అనాధగా మారాడు. చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన దీకొండ సాద్దీన్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. తన తండ్రి దీకొండ అశోక్ ఆదివారం రోజున గుండె నొప్పితో(హార్ట్ ఎటాక్) మరణించడంతో అనాధగా మారాడు. గత మూడు సంవత్సరాల క్రితం తన తల్లి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో మరణించింది.

మూడు సంవత్సరాల నుండి అన్ని తానై పెంచిన కొడుకుపై కొండంత ఆశలు పెట్టుకొని కంటికి రెప్పలా పెంచుకున్న తండ్రి మరణించడంతో అనాధగా మారాడు. అంతకుముందే గత 5 సంవత్సరాలకు ముందు తాత మరణించాడు, ఒక సంవత్సరం క్రితం నానమ్మ మూత్ర పిండాల వ్యాధితో మరణించారు. నాకు దిక్కెవరు అంటూ పిల్లాడు ఏడుస్తుంటే అక్కడి స్థానికులు కంటతడి పెట్టిన తీరు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎవరైనా దాతలు కానీ, ప్రభుత్వం కానీ, స్వచ్చంద సేవ సంస్థలు కానీ ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.