calender_icon.png 15 October, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్లను పంపిణీ చేసిన వ్యాపారవేత్త రుద్రంగి మురళి

15-10-2025 06:39:42 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెరువు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం బాన్సువాడకు చెందిన వ్యాపారవేత్త రుద్రంగి మురళి తన కూతురు శ్రీవల్లి పుట్టిన రోజు సందర్భంగా పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజన ప్లేట్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం అని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు రుద్రంగి మురళి దంపతులకు శాలువతో సన్మానించడం జరిగింది.