15 March, 2026 | 10:22 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ నుండి సాయి

14-01-2026 09:27 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధిష్టానం ప్రకటించడంతో, పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు రాసురి హరిక్రిష్ణ ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మండల నాయకులు సిర్ర సాయి సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు నుండి పోటీలో ఉంటానని బుధవారం తెలిపారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  భావజాలాన్ని, ఆయన ఆశయాలను, సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. ఈ మేరకు జనసేన అభ్యర్థులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.