calender_icon.png 9 June, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్ మిత్రతో తప్పనున్న ఇక్కట్లు

09-06-2025 01:04:53 AM

నిజాంసాగర్,జూన్ 8(విజయక్రాంతి): విద్యార్థుల యోగా క్షేమాలను దృష్టిలో పెట్టుకుని గురుకులాల అధికారులు మొబైల్ మిత్రను ప్రారంభించినట్లు అచ్చంపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కే. జనార్ధన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకుల పాఠశాలతో పాటు అచ్చంపేట గురుకుల పాఠశాలలో మొబైల్ మిత్ర ఫోన్ లను ఇప్పటికే బిగించారు. ప్రతి నలుగురు విద్యా ర్థులను కలిపి ఒక కార్డు ఇవ్వనున్నారు.

ఈ కార్డుపై వారి తల్లి తండ్రుల ఫోన్ నెంబర్లను అప్లోడ్ చేసి కార్డు యాక్టివేషన్ చేస్తారు. ప్రతి విద్యార్థికి ఒక కోడ్ నెంబర్‌ను ఇవ్వడంతో వారి తల్లి దండ్రులతో రోజు వారీగా సుమారుగా 25 నిమిషాలు మాట్లాడుకునే అవకాశం ఉంది. దీంతో విద్యార్థుల యోగా క్షేమాలతో పాటు పిర్యాదులను సైతం ఎప్పటికప్పుడు తల్లి దండ్రుల దృష్టికి వెళ్లనుంది.

అదేవిధంగా గురుకులాల సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ సైతం అందుబా టులో ఉండటంతో పాఠశాల/ కళాశాలల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉందనీ అన్నారు. ఈ మొబైల్ మిత్ర కార్యక్రమం పాఠశాలాల పునఃప్రారంభం నుండి పనిచేయనున్నట్లు పేర్కొన్నారు.