08-12-2025 05:04:48 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఉత్తర భారతదేశం నుంచి 300 మంది సాధు, మహాత్ములు, సత్పురుషులు, సిద్ధ పురుషులు గోదావరి పరిక్రమ (ప్రదక్షిణ) నిమిత్తంగా బయలుదేరి ఈనెల 9న నిర్మల్ చేరుకుంటున్నారని స్వాగత కమిటీ సభ్యుడు అరుణ్ శర్మ సోమవారం తెలిపారు. గోదావరి నది నాసిక్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర బాసర మీదుగా కాలేశ్వరం చేరుకుని, అక్కడి నుంచి భద్రాచలం తర్వాత రాజమండ్రి అంతర్వేదిలో తల్లి సముద్రంలో విలీనం అవుతుందన్నారు.
మొత్తం ఈ యాత్ర 15 రోజులు సాగుతుందన్నారు. ఇందులో భాగంగా మంగళవారం నిర్మల్ కి చేరుకుంటుందన్నారు. కాబట్టి రాజా శ్యామల పీఠం, మహాదేవ శక్తి సంసాన్ ట్రస్టు ఆధ్వర్యంలో వారికి స్థానిక ఈద్గామ్ చౌరస్తా వద్ద స్వాగతం పలికి, భారీ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వ్యాపార, కుల, ఉద్యోగ సంఘాలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని, ఆశీర్వచనం పొందాలని కోరారు.