15 June, 2026 | 9:29 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

శాలరీ కుంభకోణం.. ఊడిన తెలుగు వారి ఉద్యోగాలు

17-04-2025 01:51 AM
  1. 700 మంది ఉద్యోగులను తొలగించిన అమెరికా కంపెనీ

అత్యధికులు తెలుగువారే

వాషింగ్టన్, ఏప్రిల్ 16: అమెరికన్ కంపెనీ ‘ఫ్యానీ మే’ ఇటీవల 700 మంది ఉద్యోగులను తొలగించింది. 200 మందిని నైతిక కారణాలతో తొలగించినట్టు కంపెనీ పేర్కొంది. ఇందులో అత్యధికులు తెలుగువారే ఉన్నట్టు తెలుస్తోంది. మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌లో అవకతవకలకు పాల్పడటంతో పాటు నిధుల దుర్వినియోగానికి కూడా వీరు పాల్పడినట్టు కంపెనీ అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది.

తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా)తో కలిసి వీరు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు కంపెనీ ఆరోపించింది. కేవలం తానాతోనే కాకుండా మరిన్ని సంస్థలతో కూడా కుమ్మక్కైనట్టు వీరిపై ఆరోపణలున్నాయి. గతంలో టెక్ జెయింట్ యాపిల్ కంపెనీ కూడా ఇదే విధంగా ఉద్యోగులను తొలగించింది.