15 June, 2026 | 10:42 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

యోగి ‘ఒక పెద్ద భోగి’: బెంగాల్ సీఎం మమత

17-04-2025 01:48 AM

తిప్పికొట్టిన బీజేపీ

కోల్‌కతా, ఏప్రిల్ 16: వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ లో అల్లర్లు, హింసాకాండ చెలరేగడం పై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పం దించారు. ‘యోగి ఒక పెద్ద భోగి’ అని విమర్శలు గుప్పించారు. ముర్షీదాబాద్‌లో హింసాకాండ అనంతరం ఇమా మ్‌లతో మమత సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగి చాలా పెద్ద మాటలు చెబుతున్నారని, ఆయన పెద్ద భోగి అని అన్నారు. మహాకుంభ్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర్‌ప్రదేశ్‌లో అనేక మందిని ఎన్‌కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా అనుమతించరని విమర్శించారు. అల్లర్లను మమతా బెనర్జీ ప్రోత్సహిస్తున్నందునే యోగి వ్యా ఖ్యలు ఆమెకు నచ్చడం లేదని యూపీ బీజేపీ ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి అన్నారు.