calender_icon.png 16 June, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముప్పయేళ్ల కలకు మోక్షం..!

16-06-2025 12:33:55 AM

  1. వేములవాడలో రోడ్ల విస్తరణకు శ్రీకారం
  2. మటన్ మార్కెట్ ను కూల్చివేసిన అధికారులు 
  3. స్వచ్ఛందంగా తొలగించుకుంటున్న కొందరు 
  4. -  70 మంది నిర్వాసితులకు పరిహారం అందజేత 
  5. కూల్చివేతలు ప్రారంభం.. 144 సెక్షన్ అమలు 

రాజన్న సిరిసిల్ల: జూన్ 15 (విజయక్రాంతి ): సుమారు ముప్పు ఏళ్ల కల.. ఏళ్ల తరబడి నిరీక్షణ వెరసి వేములవాడ ప్రధాన రహదారి రోడ్ల విస్తరణ పనులకీ మోక్షం లభించింది. వేములవాడ మూలవాగు నుండి రాజన్న ఆలయం వరకు రహదారి విస్తరణకు ఆదివారం ముహూర్తం ఖరారు చేశారు.ముందుగా మున్సిపల్, రాజన్న ఆలయానికి సంబంధించిన దుకాణాలను కూల్చి వేశారు.

భూ నిర్వసితులకు రూ. 47 కోట్లు మంజూరు కాగా 250 మంది భూ నిర్వాసితులకు గాను 70 మంది చెక్కులు తీసుకున్నారు. ఇండ్లు,దుకాణాలు ఖాళీ చేయాలని గత 15 రోజుల క్రితమే అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారులు నోటీసులు జారీ చేసిన గడువు ముగియగానే ముందుగా మున్సిపల్,ఆలయ దుకాణాలు కూల్చి వేశారు.మిగతా ఇండ్లు,దుకాణాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉంది.

మున్సిపల్ సిబ్బంది దుకాణాలు ఖాళీ చేయాలని దుకాణదారులకు సమాచారం చేరవేయడంతో కొంత మంది నిర్వాసితులు స్వచ్ఛందంగా నిర్మాణాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. గడువులోపు ఖాళీ చేయనిదుకాణదారులపైజిల్లా కలెక్టర్ స్థానిక అధికారులకు పలు సూచనలు జారీ చేసినట్లు తెలిసింది.

కూల్చివేత కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్,జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ, ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ వారంలో కూల్చివేత ప్రక్రియను.పూర్తిచేయనున్నట్లు అధికారులు చెప్పడంగమనార్హం.