12-09-2025 12:02:59 PM
తాండూరు, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు ప్రముఖ వైద్యులు బివిజి ఫౌండేషన్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్ నిరుపేద కుటుంబానికి ఆర్థిక అందించి చేయూతనిచ్చారు. యాలాల మండలం దేవనూర్ గ్రామానికి చెందిన లింగమంతుల సరస్వతి నేడు మృతి చెందారు. విషయము గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న బీవీజీ ఫౌండేషన్(BVG Foundation) వ్యవస్థాపకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించి చేయూతనిచ్చి ఆసరాగా నిలిచారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇలాంటి నిరుపేద కుటుంబలకు తన వంతు ఆర్థిక సహాయం చేస్తు వారి కుటుంబ సభ్యులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్న సంపత్ సర్ అనుకున్న అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలో ముందుకు ఎదుగాలని ఇలాంటి ఏన్నో కుటుంబల ఆశీస్సులు ఎల్ల వేళల ఉంటాయని కృతజ్ఞతలు తెలిపారు.