3 July, 2026 | 10:42 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

రామచంద్రపురం స్మశానవాటికలో అభివృద్ధి పనులు ప్రారంభం

12-09-2025 12:50 PM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నాగేష్

రామచంద్రపురం,(విజయక్రాంతి): “అభివృద్ధి అనగానే గుర్తుకొచ్చేది రామచంద్రపురం డివిజన్”(Ramachandrapuram cemetery) అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో రామచంద్రపురం స్మశానవాటికలో సీసీ రోడ్లు, వెయిటింగ్ హాల్, బార్బర్ షెడ్, ధోబి ఘాట్, గ్రీనరీ, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.98 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, ఎస్ఎస్ కేశవులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.