3 July, 2026 | 8:47 PM

Breaking News

తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •  

ముత్తారంలో బాధిత కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ

12-09-2025 01:42 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూటి రఫీ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమె ను, కేశనపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బక్కతట్ల కుమార్ యాదవ్ అనారోగ్యంతో ఉండగా ఆయనను, పోతారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెలకల జితెందర్ యాదవ్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతనిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అధైర్య పడద్దని అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.  మంత్రి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ట తిరుపతి యాదవ్, ముత్తారం మాజీ జడ్పిటిసి, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.