30-05-2025 10:45:00 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని నారాయణపూర్ ఎస్ఐ జగన్ అన్నారు. శుక్రవారం నారాయణపూర్ మండల కేంద్రంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సరైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. సరైన నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవని అన్నారు.సరైన పత్రాలు,హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా విధించారు.