30-05-2025 10:35:45 PM
వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగిన నిందితుడు
చికిత్స కోసం వెళ్ళి మరుసటి రోజు 'కథ రివర్స్'
రాజకీయ రంగుతో ఎస్ఐపై ఆరోపనలు సరికాదని నిందితుడు భార్య వీడియో వైరల్
పెన్ పహాడ్: వరకట్నం వేధింపుల కేసులో వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని దోసపహాడ్ లో గురవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోపి కృష్ణ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన దొంగరి నాగార్జున గరిడేపల్లి మండలం కీతవారిగూడెంకు చెందిన అనూషతో వివాహం జరగగా వీరికి ఇద్దరు సంతానం. అనూషకు పసుపుకుంకుమల కింద తల్లిగారు 1.20 వ్యవసాయ భూమి ఇచ్చారు. ఆభూమిని అమ్మి డబ్బులు తీసుకురమ్మని అనూషను పలు మార్లు వేదింపులు గురిచేశాడు.
అయితే బుధవారం రాత్రి ఇదే విషయంలో అనూషతో భర్త నాగార్జున గౌడవకు దిగగా తప్పనిసరి పరిస్థితిలో పిల్లలతో కలిసి తన తల్లిగారింటికి ఆ రాత్రి వెళ్ళింది. మరుసటి రోజు గురువారం ఉదయాన్నే పోలీస్ స్టేషన్ కు వచ్చి తన భర్త పై భూమిని అమ్మి డబ్బులు తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా వేదిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాధు చేసింది. ఈ మేరకు నిందితుని తల్లిదండ్రుల ఎదుటనే నాగార్జున్ ని పిలిపించి కుటుంబ సభ్యుల ఎదుటనే కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా నాగార్జున్ వినక పోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నం : భూమిని అమ్మితే తప్ప అప్పులు తీరవని.. ఆ భూమిని అమ్మాల్సిందేనని నాగార్జున్
పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి తన తల్లిదండ్రుల ఎదుటనే అప్పటికే తన వెంట తెచ్చుకున్న పురుగులు మందు సేవించాడు. ఇది గమనించిన ఎస్ఐ, సిబ్బంది చికిత్స నిమిత్తం కారులో సూర్యాపేటకు తరలించారు. కాగా శుక్రవారం ఎస్ఐ మందలించినందుకే పురుగుల మందు సేవించానని మీడియా మందు కథ రివర్స్ అడ్డం తిరిగింది. అంతేకాకుండా నిందితుని భార్య అనూష తన భర్త వేదింపులు, తాగి ఇష్టారాజ్యంగా గ్రామంలో గొడవపడి గతంలో కేసు నమోదులు అయినకు కొత్తమే కాదని.. మా ఇంటి గొడవకు రాజకీయ రంగు తోడుకావడంతో ప్రణాళిక ప్రకారం తన భర్త పురుగుల మందు తాగి తనపైన, ఎస్ఐపైన తప్పుడు ఆరోపనలు చేయడం సరికాదని అనూష చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.