calender_icon.png 2 June, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అగ్రనేతలకు ధన్యవాదాలు

31-05-2025 12:00:00 AM

కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కమిటీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న తన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కమి టీ  సభ్యులుగా నియమించినందుకు మర్రి నిరంజన్‌రెడ్డి పార్టీ అధినాయకత్వానికి ప్రత్యే క కృతజ్ఞతలు తెలిపారు.

ఆల్ ఇండియా కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.