పారిశుద్ధం మెరుగుపరచాలి
డిఎల్పిఓ ధర్మరాణి..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వలని డివిజనల్ లెవెల్ పంచాయతీ అధికారి ధర్మారాణి(Divisional Level Panchayat Officer Dharmarani) ఆదేశించారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ సోమవారం సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రస్తుత వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని గ్రామంలోని నాలీలలో పేరుకు పోయిన పూడిక తీయాలని, అలాగే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సెగ్రెగేషన్ షెడ్ కి తరలించాలని సూచించారు. అంతే కాకుండా గ్రామంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, గుంతలు ఏర్పడిన చోట వెంటనే పూడ్చేయాలనీ, ఆయిల్ బాల్స్ తయారు చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఎం సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి కె ప్రశాంత్ లు పాల్గొన్నారు.






