13-11-2025 06:43:49 PM
ఎంపిఓ సత్యనారాయణ..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టి పారిశుద్ధం మెరుగుపరచాలని మండల పంచాయతీ అధికారి ఎం సత్యనారాయణ కోరారు. మండలంలోని వెంకటాపూర్, పొన్నారం, శంకరపల్లి గ్రామ పంచాయతీలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి, తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు లేకుండా చూడాలని, మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
అదేవిధంగా గ్రామపంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఈనెల 15 వరకు వంద శాతం ఆస్తి పన్నులు వసూలు చేసి,వెంటనే అన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. సెగ్రిగేషన్ షెడ్ లో కంపోస్ట్ ఎరువును తయారు చేయాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీలలో నీటి సరఫరా, శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు కొండ్రు ప్రశాంత్, హరీష్, రాజేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.