రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్
10-04-2026 02:14 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని రచ్చపల్లి గ్రామ పంచాయతీ వద్ద గ్రామ ప్రజలకి ప్రయాణికులకు వేసవి కాలంలో త్రాగు నీటి సౌకర్యం కోసం రచ్చ పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలక వర్గం ఆధ్వర్యంలో చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనీకి గ్రామ సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్ తో పాటు మాజీ ఎంపీటీసీ మిరియాల ప్రసాద్ రావు, ఉప సర్పంచ్ గుర్రం సృజన సదా నందం, వార్డు సభ్యులు వంకు డోత్ సమ్మక్క, పంచాయతీ కార్యదర్శి పోషం, సింగన వేన మల్లేష్, అశోక్. సతీష్, ఐలికొమురయ్య, సిరిశెట్టి మొగిలి, వడ్లకొండా రామస్వామి, ఆషాడం కుమార్, సాయి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




