calender_icon.png 29 December, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరు వేసి నీటి సమస్య తీర్చిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి

29-12-2025 06:39:59 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ప్రత్యేకంగా పట్టు బిగిస్తున్నారు. నీటి ఎద్దడి నివారణ కోసం బోరు మోటర్ ను పిలిపించి రథం గల్లి, అలాగే ఎల్లమ్మ గల్లి దొడ్డి ప్రాంతంలో బోర్లు వేయించేందుకు బోరు మోటర్ ను పూజ చేశారు.

నీటి ఎద్దడి నివారణ కోసం నూతన సర్పంచ్ తీసుకున్న చర్యలు పట్ల ఆయా గల్లి ప్రజలు సర్పంచ్ పని తీరిపోయి హర్షం వ్యక్తం చేశారు. రథం గల్లీలో బోరు మోటర్ భూమి పూజ కార్యక్రమంలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామస్తులు గల్లి వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.