26 February, 2026 | 2:55 AM

శాతవాహన ఫార్మసీ అధ్యాపకురాలు అశ్వినికి డాక్టరేట్

26-02-2026 01:14 AM

కొత్తపల్లి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): మానవ శరీరంలో హైపర్ టెన్షన్ (బిపి) నియంత్రణలో సాధారణ టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా ఈప్రోనియోసోమ్స్ పద్దతి పై చేసిన పరిశోధనకు గాను శాతవాహన ఫార్మసీ విభాగానికి చెందిన అధ్యాపకురాలు జె అశ్విని చేసిన పరిశోదనకు అనురాగ్ విశ్వావిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగం డా క్టరేట్ ప్రదానం చేసింది.

అనురాగ్ విశ్వవిద్యాలయ ఫార్మాసీ విభాగములో డీన్ డా క్టర్ వసుధా భక్షి పర్యవేక్షణలో ‘ఫార్ములేషన్ డెవలప్మెంట్, ఆప్టిమైజేషన్ అండ్ ఇవాల్యూయేషన్ ఆఫ్ ప్రోనియోసోమ్స్ ఆఫ్ యాంటి హైపెర్టిన్సివ్ డ్రగ్స్‘ అంశంపై తన పరిశోధన చేసారు. డాక్టరేట్ సాధించిన జె అశ్విని కరీంనగర్ ఎల్‌ఎండి సమీపంలోని శాతవాహన ఫార్మసీ కళాశాలలో గత 12 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సంద ర్భంగా ఆమెను ఎస్ యు వీసీ ఉమేష్ కుమార్, అధ్యాపకులు అభినందించారు.