11-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 10: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. యూకేకు చెందిన ఆయుధ సలహాదారు సం జయ్ భండారీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ మంగళవారం విచార ణకు రావాలంటూ సమన్లు జారీ చేసింది.. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను విచారణకు హాజరవ్వలేకపోతున్నట్టు వాద్రా పేర్కొన్నట్టు తెలిసింది.
దీంతో రాబర్డ్ వాద్రాను విచారించేందుకు ఈడీ కొత్త తేదీని ఖరారు చేసే అవకాశముంది. మనీలాండరిం గ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా, అక్రమాస్తుల కేసులో పరారీలో ఉన్న సంజయ్ భండారీతో వాద్రాకు సం బంధాలు ఉన్నట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
సంజయ్ 2016లో భారత్ నుంచి పారిపోయాడు. విదేశాల్లో అక్రమ ఆస్తులు, పీఎంఎల్ఏ, బ్లాక్ మనీ యాక్ట్ తదితర ఆరోపణలు అతడిపై ఉన్నాయి. యూపీఏ హయాంలో రాబర్ట్ వాద్రాతో సంజయ్ బండారీకి లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఈ కేసులో ఈడీ వాద్రాపై దృష్టి సారించింది.