calender_icon.png 12 June, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుట్రపూరిత రాజకీయాలకు చెంపపెట్టు

09-06-2025 10:35:59 PM

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao)పై వేసిన అనర్హత పిటిషన్ గౌరవ హై కోర్ట్ డిస్మిస్ చేయడం కుట్రపూరిత రాజకీయాలకు చెంపపెట్టు లాంటిదని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా(CPI District Secretary SK Sabir Pasha) అన్నారు. అనర్హత పిటిషన్ డిస్మిస్పై సోమవారం అయన స్పందిస్తూ ప్రజల నియోజకవర్గ ప్రజలు ఏకపక్షంగా కూనంనేనిని కోరుకున్నారని, ప్రజాస్వామ్య పద్దతిలో ఎమ్మెల్యేగా గెలిచినా కూనంనేని అర్హుడు కాదంటూ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. ప్రజల అభిష్టానికి బిన్నంగా దొడ్డిదారిన అందలం ఎక్కాలని కుట్ర చేసిన వ్యక్తులకు కోర్టు గట్టి సమాధానం చెప్పిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయాయని, భవిష్యత్తులో రెట్టింపు ఉత్సహంతో కూనంనేని ప్రజలకు సేవలందిస్తారని, నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు.