calender_icon.png 10 June, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు అగ్రనేత అడెల్లు అంత్యక్రియలు

10-06-2025 12:00:00 AM

అదిలాబాద్, జూన్ 9 (విజయక్రాంతి):  మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌కు విరసం నేతలు లాల్ సలాం చెబుతూ ఉద్యమ వీడ్కోలు పలికారు. బీజాపూర్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు మృతదేహం ఆదివారం రాత్రి ఆయన స్వగ్రామమైన బోథ్ మండలం పొచ్చరకు చేరుకుంది.

30 ఏళ్ల కిందట గ్రామం విడిచి అడవి బాట పట్టి ఇప్పుడు విగతజీవిగా గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం నిర్వహించిన అడెల్లు అంత్యక్రియల్లో కమ్యూనిస్ట్ నాయకులు, విరసం నేతలు, పౌర హ క్కుల సంఘం నేతలు, వివిధ ప్రజా సంఘా ల నాయకులు తరలివచ్చారు. అలాగే అడె ల్లు అంత్యక్రియల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు.

అడెల్లు మృతదేహానికి నివాళ్ళు అర్పించి, వారి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. కామ్రేడ్ అడెల్లు కుటుంబాన్ని ప్రభుత్వం అదుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తా ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ పేరుతో అమాయక బహుజనులను హతమరుస్తోందని ఆరోపిం చారు. మావోయిస్టు లతో చర్చలు జరిపి వా రి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.