10-06-2025 12:00:00 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్
మంచిర్యాల, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని మాత్రమే పక్షపాతం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎం పిక చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ సోమవారం ప్రజా వాణిలో కలెక్టర్ కుమార్ దీపక్కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధికారులకే రాజీ వ్ వికాసం ఇవ్వాలని, సిబిల్ స్కోర్తో సం బంధం లేకుండా పాన్కార్డుని పరిగణలోకి తీసుకోకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఉండి నిజమైన అర్హులకు రాజీవ్ వికాసం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబిల్ స్కోర్ కేవలం ఆర్థికంగా సమర్థులై ఉన్నవారు, బ్యాంకుల లో డబ్బులు ఉన్న వాళ్లకు మాత్రమే సిబిల్ స్కోర్ ఉంటుందని, ఎవరైతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేక బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుందన్నారు.
ఇలా డబ్బులు ఉన్న వాళ్లకే ఓ వికాసం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే విధంగా ఇల్లు లేని వారికి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వా లనీ డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే లిస్టులో చేర్చడం, వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, పట్టి వెంక ట కృష్ణ, దుర్గం అశోక్, ఆకుల అశోక్ వర్ధన్, ఎనగందుల కృష్ణమూర్తి, జీవీ ఆనంద్ కృష్ణ, పులగం తిరుపతి, సత్రం రమేష్, అమిరిశెట్టి రాజు, బొలిశెట్టి అశ్విన్, కాశెట్టి నాగేశ్వర్ రావు, దీక్షితులు, మంత్రి రామన్న, సంజీవ్ రెడ్డి, ఈర్ల సదానందం, బుద్దారపు రాజమౌళి, కర్రె చక్రి, ఆకుల నరేందర్, బింగి సత్యనారాయణ, మల్కా రాజేశం, తడూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు