calender_icon.png 1 June, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో సున్నా విద్యార్థులున్న స్కూళ్లు 1,980

31-05-2025 02:52:25 AM

  1. వీటిలో ప్రైమరీ స్కూళ్లు 1,900 
  2. యూపీఎస్ బడులు 40.. హైస్కూళ్లు 40

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సున్నా ఎన్‌రోల్‌మెంట్ ఉన్న ప్రభుత్వ స్కూళ్లు 1,980 ఉన్నట్లు విద్యాశాఖ గణంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాదిలో జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న బడుల సంఖ్య 1,864 ఉండగా, ఇప్పుడా సంఖ్య 1,980కి పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 వరకు గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి 26,106 ఉంన్నాయి.

వీటిలో ప్రాథమిక బడులు 18,259 ఉండగా, వీటిలో ఏకంగా 1,900 బడుల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్. ప్రాథమికోన్నత పాఠశాలలు 3,143 ఉండగా, వీటిలో 40 బడుల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్. ఉన్నత పాఠశాలలు 4,704 ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 40 బడుల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్.