12-06-2025 08:35:09 PM
ఏ సి ఎం ఓ ఉద్ధవ్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఏసీఎంవో ఉద్దవ్(ACMO Uddhav) అన్నారు. ఆసిఫాబాద్ మండలంలోని వట్టి వాగు దిశా మోడల్ పాఠశాలలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలలో అడ్మిషన్ చేయించాలని కోరారు. గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో నిర్వహించే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.