2 March, 2026 | 10:44 AM

శ్రీ చైతన్య సీబీఎస్సీ పాఠశాలలో సైన్స్ ఎక్స్‌పో

02-03-2026 12:33 AM

హైదరాబాద్, మార్చి1(విజయక్రాంతి): కూకట్‌పల్లి శ్రీచైతన్య సీబీఎస్సీ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఎక్స్‌పోలో విద్యార్థినీ విద్యా ర్థులు వివిధ వర్కింగ్ మోడల్స్‌తో అలరించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్ట ర్ ఆనంద్ కుమార్, అనన్య వైద్యశాల చైర్మన్ వ్యవస్థాపకులు హాజరై మాట్లాడారు. ఈ సంవత్సరం సైన్స్ టీం ఉమెన్ ఇన్సైన్స్ కేటలైజింగ్ వికసిత్ భారత్ గురించి వివరించారు.

నేటి సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికను రూ పొందించుకొని వాటిని అమలు పరచాలని సూచించారు. విద్యారినీవిద్యార్థులు చేసిన న మూనాలను పరిశీలించి వారిని అభినందించారు. ఏజీఎం శివరామ కృష్ణ, ఆర్‌ఐ పద్మ జ, వైస్ ప్రిన్సిపాల్ కాంతి, ఇన్‌చార్జిలు హర్షి ణి,అనిత,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.