calender_icon.png 27 June, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గాం ప్రస్తావన లేకుండానే ఎస్‌సీవో పత్రం

27-06-2025 12:50:13 AM

  1. సంతకానికి రాజ్‌నాథ్ నిరాకరణ
  2. అంతర్జాతీయ వేదికగా దాయాదిపై రక్షణమంత్రి విమర్శలు

న్యూఢిల్లీ, జూన్ 26: చైనాలోని కింగ్‌దావోలో గురువారం జరిగిన షాంఘై సహ కార సంస్థ (ఎస్సీవో) రక్షణమంత్రుల సమావేశంలో ఉగ్రవాదం విషయంలో భారత్ తన వైఖరిని, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని చాటిచెప్పింది. ఉగ్రవాద నిర్మూలన, ప్రాం తీయ భద్రత వంటి అంశాలపై రూపొందించిన ఉమ్మడి ప్రకటనలోని కొన్ని ప్రతిపా దనలు భారత ప్రయోజనాలకు, వైఖరికి విరుద్ధంగా ఉండటంతో, దానిపై సంతకం చేసేందుకు భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నిరాకరించారు.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ.. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా వాడు కుంటున్నాయని పరోక్షంగా దాయాది పాక్ ను దుయ్యబట్టారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాజ్‌నా థ్‌సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం, ఉగ్రవాదం పై, ప్రత్యేకించి సరిహద్దు ఉగ్రవాదంపై భార త కఠిన వైఖరిని ప్రపంచానికి స్పష్టం చేశా యి.

సమావేశం అనంతరం విడుదల చేయాలని భావించిన ఉమ్మడి ప్రకటన ముసాయి దాలో, ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రస్తావన లేకపో వడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.

అదే సమయంలో, పాక్ పదేపదే ఆరోపిస్తున్న బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ కార్యకలాపాల గురించి పరోక్షంగా ప్రస్తావించే ప్రయత్నాలు జరిగాయని, దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిందని స మాచారం. ఉగ్రవాద అంశంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎస్‌సీవో ఎలాంటి ఉమ్మడి ప్రకటనను జారీ చేయకుండానే సమావేశం ముగిసింది.