27-06-2025 12:43:39 AM
న్యూఢిల్లీ, జూన్ 26: భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైందని, ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలు దాని కిందే పనిచేస్తాయని సు ప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్కు అధికారులు ఉన్నాయి..
కానీ, రాజ్యాంగ ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదని పేర్కొన్నారు. ‘చాలామంది పార్లమెంట్ అత్యున్నతమైందని అంటారు. కానీ, నా ఉద్దేశంలో భారత రాజ్యాంగమే అత్యంత ముఖ్యమైంది. ప్రజాస్వామ్యంలోని మిగిలి మూడు విభాగాలు దానికిందే పనిచేస్తాయి. మనం విధులు నిర్వహిస్తున్నామని న్యాయమూర్తులు ఎల్లప్పు డూ గుర్తుంచుకోవాలి.
మనం ప్రజల హక్కులకు, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు రక్షకులం. కేవలం మనకు అధికారం మాత్ర మే లేదు. బాధ్యతలూ ఉన్నా యి. తీర్పుల గురించి ప్రజలు ఏమనుకొంటున్నారు అన్న ది న్యాయమూర్తులను ప్రభావితం చేయకూడదు. మనం స్వతంత్రంగా ఆలోచించాలి’ అని పేర్కొన్నారు