23-09-2025 06:04:35 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల త్రిశక్తి క్షేత్రంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవార్లు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీ దేవి మంత్రం జపంతో జ్ఞాపకశక్తి బుద్ధి పెరుగుతాయని, ఈ సందర్భంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను నారింజ రంగు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద సంస్కృతి పరిషత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.