1 July, 2026 | 11:11 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఎమ్మెల్యే కుంభం చొరవతో బునాదిగాని కాలువ గండి పూడ్చివేత

23-09-2025 06:01 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని పహిల్వాన్ పురం గ్రామంలో గల బునాదిగాని చెరువులోకి వచ్చే కాలువకు ఎర్రబెల్లి సమీపంలోని నార్లకుంట వద్ద గండి పడింది. ఈ విషయాన్ని రైతులు వెంటనే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే కుంభం ఆదేశాలతో వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మాజీ ఎంపిటిసి గాడిపళ్లి యాదయ్య ఆధ్వర్యంలో జెసిబిలతో గండి పడిన ప్రాంతాన్ని గత రెండు రోజులుగా నిరంతరం శ్రమించి పూడ్చివేశారు. దీంతో కాల్వ ద్వారా చెరువు ద్వారా సాగునీరు ఉపయోగించుకునే రైతులంతా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.