13 April, 2026 | 4:25 PM

Breaking News

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •  

ఈనెల 16 వరకు 144 సెక్షన్

14-02-2026 12:48 AM

డీఎస్పీ రాజశేఖర్ రాజు

మిర్యాలగూడ, ఫిబ్రవరి 13: రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గ నిర్దేశాల మేరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున  ఈనెల 16 వరకు ఆయా మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎలాంటి ర్యాలీలు, డీజేలకు, ఊరేగింపులకు ఎలాంటి అనుమతులు లేవని, అదేవిధంగా జనాలు ఒకే చోట గుమి కూడా వద్దని పోలీస్, సెక్యూరిటీ యాక్ట్లు అమలులో వాటిని ఎవరు అతిక్రమించవద్దని, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున దానిని ఎవరు అతిక్రమించవద్దని డీజే లకు ఎలాంటి అనుమతులు లేనందున డీజే యజమానులు వాటిని గమనించి నడుచుకోవాలన్నారు. అతిక్రమిస్తే డీజే లను షేర్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ఈనెల 16 తర్వాత పోలీసు ముందస్తు అనుమతు లతో పరిమిత సంఖ్యతో ఊరేగింపులు ర్యాలీలు చేపట్టాలన్నారు.