24-07-2025 12:00:00 AM
స్కూటీతో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
మునిపల్లి, జులై23 : జహీరాబాద్ వైపు నుంచి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్న ఎండు గంజాయిని బుధవారం నాడు కంకల్ టోల్ ప్లాజా వద్ద మునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్త్స్ర రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్ లోని ఇరానీ గల్లి నుంచి హైదరాబాద్ కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ట్లు నమ్మదగిన సమాచారం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనఖీ చేపట్టారు.
ఈ క్రమంలో స్కూటీపై అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేయగా అందులో 500 గ్రాముల గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల కు చెందిన మోజాల ఈశ్వర్, సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం కవేలి గ్రామానికి చెందిన బోయిన నిఖిల్ లు బీదర్ లోని ఇరానీ గల్లీలో ఓ వ్యక్తి వద్ద తక్కువ ధరకు ఎండు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు విక్రహిస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
పట్టుబడిన ఎండు గంజాయితో పాటు గంజాయిని సరఫరా చేసిన స్కూటీ, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్త్స్ర రాజేష్ నాయక్ తెలిపారు.