11-08-2025 08:36:59 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): మహిళల ఆర్థిక అభివృద్ధికి స్వయం సంఘాలు కృషి చేస్తాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో సామాజిక చేకూర్పు- నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు విభిన్న ప్రతిభవంతుల (పిడబ్ల్యుడి) సంఘాలు, కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు శిక్షణ కార్యక్రమమును సోమవారం కళాభవనులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమంలో హాజరైన 22 మండలాల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, గ్రామ సంఘాల క్లస్టర్ కో-ఆర్డినేటర్లను, మండల సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మిగిలిపోయిన సంఘాలలో చేరినటువంటి నాలుగు రకాలు మొదటిగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు సంఘాల్లో చేరకుండా మిగిలిపోయిన పేద మహిళలను అందరిని సంఘాలలో చేర్పించాలని అన్నారు.
60 సంవత్సరాలు నిండిన వృద్ధ మహిళలను వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న కిశోర బాలికలకు కిషోర్ బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విభిన్న ప్రతిభవంతుల (పిడబ్ల్యూడి) సంఘాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. కొత్తగా సంఘాలలో చేరడం ద్వారా పొందేటువంటి లబ్ధిని, లాభాలను వారికి తెలియజేసి సంఘాలుగా ఏర్పడి వీటి ద్వారా వారి ఆర్థిక, సామాజిక జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని ఏపీఎంలకు, సీసీలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడి) చందర్ నాయక్, గ్రామీణ పేదరిక నిర్మూలన డిఆర్డిఓ సురేందర్, అడిషనల్ డిఆర్డిఓ విజయలక్ష్మి, డీపీఎం, శ్రీనివాస్, నాన్ ఫాం డిపిఎం సాయిలు, ఫాం డిపీఎం సురేష్, సోషల్ సెక్యూరిటీ డిపిఎం శోభ, ఫైనాన్స్ డిపిఎం రాజయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.