బంగాల్లో వరుస అరెస్టులు
- టీఎంసీ నేతలే టార్గెట్
- పాత కేసులపై కొత్త ప్రభుత్వం గురి
కోల్కతా, మే 27: గతంలో రాజకీయ అం డతో పోలీసులపైనే దాడులకు పాల్పడిన నేరగాళ్లకు ప్రస్తుతం పశ్చిమ బంగాల్ పోలీసులం టే సింహాస్వప్నమని తెలిసొస్తుంది. బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా సువేం దు అధికారి నియమితులయ్యాక గూండాలు, రౌడీలు, టీఎంసీ నాయకుల బెదిరింపులకు చెక్ పెడుతున్నారు. అంతేగాక అవినీతి, అక్రమాలు, సరిహద్దు చొరబాట్లపై కఠినంగా వ్యవ హరిస్తున్నారు.
కాగా పశ్చిమ బెంగాల్లో ము గ్గురు టీఎంసీకి చెందిన స్థానిక రౌడీలను పోలీసులు అరెస్టు చేస్తూ వీధుల్లో ఊరేగించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ముగ్గురిపై సరిగ్గా ఎన్నికలకు ముందు పోలీసులపై కాల్పులు జరపడం, బాంబులు విసరడం, దాడులు చేయడం వంటి అభియోగాలు నమోదై ఉన్నాయి. ఉత్తర హౌరాలో డాన్గా పేరు పొందిన ఆకాష్ సింగ్ను పోలీసులు లోదుస్తులపై నడిపించుకుంటూ, గుం డుకొట్టించి స్టేషన్కు తీసుకువెళ్లారు. మరోవై పు ఈ వీడియోను పంచుకున్న స్థానిక బీజేపీ నేరాల పట్ల తమ ప్రభుత్వానికున్న ‘జీరో టాలరెన్స్’ విధానంగా పేర్కొంది. మే 7వ తేదీన జరిగిన హింసకు సంబంధించి టీఎంసీకి చెందిన షమీమ్ అహ్మద్ను ముంబై నుంచి అరెస్టు చేశారు.






