10-02-2026 01:10:33 AM
గెలుపు బాటలో గండ్ర శిల్పారావు
కోరుట్ల, ఫిబ్రవరి 9(విజయక్రాంతి): కోరుట్లలోని 9వ వార్డు ప్రజల సేవే లక్ష్యం గా.. అభివృద్ధే తన ధ్యేయమని బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర శిల్పారావు పేర్కొన్నారు. శి ల్పారావు అనునిత్యం వార్డులోని ప్రజలతో మమేకమై వారి సమస్యలు ఆయన సమస్యలుగా భావించి వార్డును అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతానని ఇంటింటా ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రజలు కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు శిల్పారావు తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అం డదండలతో వార్డుని అభివృద్ధిలోమరింత ముందుకు తీసుకెళ్తానని, వార్డులో డ్రైనేజీ సమస్య, రోడ్లు, పారిశుద్ధ్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని గడప గడపకి ప్రచారం చేస్తూ కారు గుర్తుపై తమ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని శిల్పారావు కోరా రు. ఈ ప్రచారంలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ మార్కెట్ చైర్మన్ లోకబాపురెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.