14-02-2026 11:47:44 AM
అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. పుల్వామా ఉగ్రదాడికి(Pulwama terror attack) ఏడేళ్లు అవుతోంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడిలో 40 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అమరవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అమరవీరులను ప్రధాని స్మరించుకున్నారు. సైనికుల సంకత్పం, దేశ సేవ ఎప్పటికీ నిలిచి ఉంటాయని ప్రధాని తెలిపారు. అమరవీరుల వీరత్వం నుంచి ప్రతీ భారతీయుడు బలాన్ని పొందుతాడని ప్రధాని పేర్కొన్నారు.