22 May, 2026 | 7:38 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం

23-03-2026 02:36 PM

షాద్‌నగర్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక ఘట్టంగా, షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, ఓబీసీ విభాగం చైర్మన్‌గా తన పదవి బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాట్లాడిన వీర్లపల్లి శంకర్, ఓబీసీ వర్గాల అభివృద్ధి కోసం తాను మరింత కృషి చేస్తానని, సామాజిక న్యాయం సాధనలో ముందుండి పనిచేస్తానని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ సమాజానికి అవకాశాలు పెంపొందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... వీర్లపల్లి శంకర్ నాయకత్వంలో ఓబీసీ విభాగం మరింత బలోపేతం అవుతుందని, ఆయనకు ఈ బాధ్యతలు తగినవేనని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వీర్లపల్లి శంకర్ కి శుభాకాంక్షలు తెలిపారు.