23-09-2025 07:32:37 PM
బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామ ఫ్రెండ్స్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 18 సంవత్సరాలుగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహింస్తున్నట్లు యూత్ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఏడాది 18వ వార్షికోత్సవం సందర్భంగా 9 అవతారాల అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించారు. గ్రామంలో ప్రజలు సుఖసంతోషాలతో పాడి పంటలతో సుఖంగా ఉండాలని అమ్మవారిని పూజించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు వివిధ రూపాలలో కొలువుదీరిన అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఒక్కో అవతారంలో విశిష్ట పూజలు అందుకోవడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.