27-05-2025 12:02:41 AM
రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన ప్రధాన పాత్రల్లో రూపేశ్ హీరోగా, నిర్మాతగా మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై పవన్ ప్రభ తెరకెక్కించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ మూవీలో ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను మే 30న విడుదల చేయబోతోన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో దర్శకుడు పవన్ ప్రభ ‘షష్టిపూర్తి’ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..
సినిమా విషయంలో నాకు చాలా గ్యాప్ వచ్చింది. ఇన్నేళ్లలో సినిమా అంటే ఏం టో ఇంకా నేర్చుకున్నాను. నేను ఈ ‘షష్టిపూర్తి’ గురించి చాలా చోట్ల తిరిగాను. ఇళయరాజా కావాల్సిందే అని ముందు నుంచీ ఫిక్స్ అయ్యాను. ఇలాంటి చిత్రాలకు డేట్లు అడ్జస్ట్ అవ్వాలి.. షూటింగ్కి టైం పడుతుంది. కానీ నేను ఈ సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యాను. అందుకే ఇన్నేళ్లు పట్టింది.
మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. నాకు అందరి ప్రేమ తెలుసు. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త ఇలా అందరి మధ్య పెరిగాను. కానీ ఇప్పుడు కొందరికి అమ్మానాన్నలు కూడా బరువు అవుతున్నారు. నడి రోడ్డు మీద వారిని వదిలేస్తున్నారు. అమ్మానాన్నల గొప్పదనాన్ని, ప్రేమ విలువను చెప్పాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ని తీశాను.
‘షష్టిపూర్తి’ విషయంలో నేను ముందు నుంచీ చాలా క్లారిటీతో ఉన్నాను. రాజేం ద్రప్రసాద్, అర్చనని నేను మళ్లీ రెండో టేక్ అని అడగాలంటే ఎంత ధైర్యం కావా లి. ఓ స్ట్రిక్ట్ మదర్ ఎలా ఉంటారో అలానే చూపించాను. ఓ జోవియల్ ఫాదర్ ఎలా ఉండాలో అనేలా రాజేంద్రప్రసాద్ ను చూపించాను.
‘షష్టిపూర్తి’ ట్రైలర్ను అందరూ మెచ్చుకుంటారు. సినిమాలో ఏదో విషయం ఉంద ని అంతా అంటున్నారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. అందరూ ప్రశంసలు కురిపి స్తున్నారు.
‘షష్టిపూర్తి’ లాంటి ఎమోషనల్ డ్రామా కి, తల్లిదండ్రుల సెంటిమెంట్ మీద రాసుకున్న కథకు మ్యూజిక్ చాలా ప్రాధాన్యం. అందుకే నేను ఈ చిత్రానికి ఇళయరాజా కావాలని అనుకున్నాను. ఈ కథ మొత్తా న్ని గోదావరి ప్రాంతంలోనే తీశాను. ఈ కథను ముందుగా రూపేశ్కు చెప్పాను. కథను విన్నాక మొత్తం తన భుజాన వేసుకున్నారు.
పాటల సందర్భాన్ని తీసేసి కథను చెప్పమని ఇళయరాజా అన్నారు. ఎక్కడ పాట రావాలో నేను చెబుతాను అని ఆయనే చెప్పారు. ఇక ఫస్ట్ కంపోజిషన్ కోసం మళ్లీ వెళ్లాం. సందర్భం చెప్పిన వెంటనే హార్మోనియం మీద పల్లవి ప్లే చేసి వినిపించారు. ‘ఇది సరిపోతుందా? మీరు ఆ శించినట్టుగా ఉందా? ఇంకా ఏమైనా ట్రై చేద్దామా?’ అని ఇళయరాజా అన్నారు.
రూపేశ్, ఆకాంక్ష ఇద్దరూ అద్భుతంగా నటించారు. రూపేశ్ కారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆకాంక్ష అచ్చమైన తెలుగమ్మాయి పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.
‘షష్టిపూర్తి’ అనేది పూర్తిగా కల్పిత చిత్రమే. ఇందులో ఉండే పాత్రల్లా బయట బతకలేరు. రాజేంద్రప్రసాద్ పోషించిన పాత్ర బయట కనిపించదు. ఇలాంటి కథను నమ్మి పెట్టుబడి పెట్టడం అంటే మామూ లు విషయం కాదు.
‘షష్టిపూర్తి’ తరువాత కొన్ని ప్రాజెక్టులు సిద్దంగా ఉన్నాయి. వాటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తాను.