calender_icon.png 30 May, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవన్ సినిమా ఆపే ధైర్యం ఎవరూ చేయరు: నిర్మాత దిల్ రాజు

26-05-2025 04:36:37 PM

హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. పర్సెంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని కొందరు చెప్పారు. పర్సెంటేజ్ గురించి ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తర్పు గోదావరి జిల్లాలో సమావేశమయ్యారని దిల్ రాజు పేర్కొన్నారు. ఆరు నెలలుగా వారికి వస్తున్న రెవెన్యూ గురించి అడిగామని, హరిహర వీరమల్లు సినిమా మేలో విడుదల అవుతున్న నేపథ్యంలో తర్వాత కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడినట్టు ఆయన చెప్పారు. 

నైజాంలో మొత్తం 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే అందులో తన వద్ద 30 థియేటర్లు ఉన్నాయని, వ్యక్తిగతంగా దాడి చేసేటప్పుడు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని దిల్ రాజు తెలిపారు. పైరసీపై మేం పోరాటం చేస్తామని నమ్మి తామతో కలిసి 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న ఎగ్జిబిటర్లకు ఏం కావాలో అడగడంలో తప్పు లేదని ఆయన వెల్లడించారు. నైజాంలో ఏసియన్, సురేస్, సునీల్ వి కలిపి మొత్తం 90 థియేటర్లు ఉన్నాయని, 250కు పైగా థియేటర్లు ఓనర్ల ద్వారానే నడుస్తున్నాయని దిల్ రాజ్ స్పష్టం చేశారు.  ఏమీ తెలియకుండానే ఇష్టం వచ్చినట్లు ఎవరికి నచ్చినట్లు వారు మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ అని దుష్ప్రచారం చేస్తున్నారని, దీంతో పర్సెంటేజ్ విధానం కావాలని ఎగ్జిబిటర్లు ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ ఇచ్చారని వివరించారు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని మా వాళ్ల  భయపడ్డారని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవరకి లేదన్నారు. థియేటర్లు మూసుకుంటే ఎగ్జిబిటర్లకే కాదా నష్టం, కొవిడ్ సమయంలో తప్ప ఎప్పుడు థియేటర్లు మూతపడలేదు. 56 రోజులు పరిశ్రమలో షూటింగ్ ఆపేసి ఏం సాధించలేకపోయాం. బంద్ అనే మాట లేకుండా సమస్య పరిష్కరించాలని కోరామని, అసలు విషయాన్ని పవన్ సినిమాపైకి పక్కదారి పట్టించారన్నారు.

పవన్ సినిమా ఆపాలని ఎవరూ ధైర్యం చేయరని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాంగ్ కమ్యూనికేషన్ వెళ్లింది. అందుకే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ స్పందించినట్లు దిల్ రాజు వివరించారు. జూన్ లో పవన్ కల్యాణ్ సినిమాతో సహా పలువురి సినిమాలు ఉన్నాయని, సనీపరిశ్రమకు ఏప్రిల్, మే నెలలు చాలా కీలకమన్నారు. సనీపరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే సిని పెద్దల ఆలోచన కావాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన చిన్న విషయం రాష్ట్రమంతా ప్రచారం చేశారని,  సినిమా వాళ్లకు రెండు రాష్ట్రాలూ ముఖ్యమని తెలిపారు. చిత్రపరిశ్రమ మేలు కోసం పవన్ కళ్యాణ్ ఎంతో చేశారని కొనియాడారు.

సినీపరిశ్రమకు కొత్త టాలెంట్ ను పరిచయం చేయాలనేది తన లక్ష్యమని, అందుకోసం దిల్ రాజు డ్రీమ్స్ అనే కంపెనీ ప్రారంభించినట్లు నిర్మాత దిల్ రాజ్ వెల్లడించారు. నిర్మాత అల్లు అరవింద్ పై కూడా అనేక విషయాల్లో దుష్ప్రచారం జరుగుతుందని, మాకు ఏదైనా సమస్యలు వస్తే రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించాలన్నారు. పర్సెంటేజ్, రెంట్ అంటూ తమాలోనే విభేదాలు ఉన్నాయని, నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ప్రభుత్వాలతో పని ఉంటుందని ఇప్పటికైనా ఈ ఎపిసోడ్ కు తెరదించాలని దిల్ రాజు కోరారు.